అసెంబ్లీ ఘన్ పార్క్ కాడ తెలంగాణ అమర వీరుల స్తూపానికి మాజీ ఐపిఎస్ అధికారి డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు. ఆయన ఈ రోజు మధ్యాన్నం 4 గంటలకు బహుజన్ సమాజ్ వాది పార్టీ (బిఎస్ పి)లో చేరి సామాజిక న్యాయం సమర శంఖం పూర్తిస్తున్నారు.
మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి సామాజిక న్యాయం ఒక నినాదంగా ప్రవేశిస్తున్నది. గురుకులవిద్యావిధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని వచ్చి బడుగుల మనసుదోచుకున్న ప్రవీణ్ రాజకీయ ప్రవేశం ఎటువైపు దారితీస్తుందో ఇపుడే చెప్పలేం. కాని ఆయన రాక రాజకీయాలకు ఒక కుదుపు కానుందని చాలా మంది భావిస్తున్నారు.