“ఒక చిన్న ఉప ఎన్నికకే వణికి పోతున్న కెసిఆర్”

 

అధికార టి.అర్.ఎస్ పార్టీ హుజూరాబాద్   ఉపఎన్నికలో లబ్ధి పొందడానికి ప్రజధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నది. ఒక ఉప ఎన్నికలో గెలవడానికి బహుశా ఏ అధికార పార్టీ ప్రజధనాన్ని ఇంత పెద్ద ఎత్తున వెదజల్లి ఉండేదేమో. ఏడేళ్లుగా అధికారంలో ఉంటూ వేలకోట్ల రుపాయలు సంక్షేమపథకాలమీద వచ్చించి ఉప ఎన్నిక అంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతగా భయపడుతున్నారో,   దళిత బంధువంటి  పథకాలను చూస్తే అర్థమవుతుంది.

మరొక వైపు, రాష్ట్రములో మళ్లీ ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరొక వైపు హుజూరాబాద్ లో ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎటువంటి కోవిద్ నిబంధనలను పాటించకుండా ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ప్రజలను కరోనా ముప్పుకు గురి చేస్తున్నారు.

ఒక వైపు ప్రజలను మాస్క్ ధరించాలి, భౌతిక దూరము పాటించాలని చెపుతూ మరొక వైపు సి.ఎమ్, మంత్రులే పాటించక పోవడము దురదృష్టకరము.

దళిత బంధు కార్యక్రమాన్ని ఉప ఎన్నికలు అయ్యే వరకు ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు జరిగే ఏ పనిని ఆపుమని కోరదు. దళిత బంధు పూర్తిగా ఎన్నికల కోసమే తెస్తున్నారు.

సి.ఎం హోదాలో ఉంటూ మేము సన్యాసులము కాదు. రాజకీయము ఎందుకు చేయకూడదని దిగజారుడు మాటలు మాట్లాడటము తగదు.

కేసీఆర్ స్వయంగా ఎన్నికల కోసమే ఈ పథకం తెస్తున్నామని అన్నారు.

ఎన్నికల కమిషన్, కోర్టులు ఆయన ప్రకటనను  సుమోటోగా స్వీకరించి, అధికార దుర్వినియోగంగా తీసుకుని చర్యలు తీసుకోవాలి. ఇపుడు ఈ దశలోనే అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి.

‘దళిత బంధు’ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ దీన్ని పూర్తిగా రాష్ట్రమంతా అమలు చేయాలి. పైలెట్ ప్రాజెక్ట్ పేరుతో ఎన్నికలు జరుగునున్న హుజూరాబాద్ లోనే ఎందుకు?

రాష్ట్రములో దళిత బంధు మొత్తం 1200 కోట్లయితే కేవలము హూజూరాబాద్ లోనే 1500 నుండి 2000 కోట్లు ఖర్చు పెడతామని సి.ఎం అనడములో ఉద్దేశ్యమేమిటి?

ప్రగతి భవన్ కు హుజురాబాద్ ప్రతి గ్రామము నుండి ఇద్దరు, ప్రతి మునిసిపల్ వార్డు నుండి ఇద్దరు నాయకులను మొత్తము 412 మందిని పిలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటము ఎన్నికల కోసమేనా? వారితో కల్సి చేసిన భోజనము ఎన్నికల కోసమేనా?

ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.

కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రతి నియోజక వర్గము నుండి ఇదే తరహాలో దళిత ప్రతినిధులను పిలిపించి భోజనము పెట్టి మాట్లాడాలి. తన ఫోటోకు రెండు వైపుల బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఫొటోలు పెట్టుకున్నంత మాత్రాన దళితబందు కాలేడు

రెండో విడత గొర్రెల పంపిణీ కూడా మంత్రి శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ నియోజకవర్గములోని జమ్మికుంట లో నిన్న ప్రారంభించి ఆ నియోజక వర్గము లోని 500 లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేశారు.

ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఈ నెల నుంచి ఇస్తామని ప్రకటించారు. 30% పిట్మెంట్ ఇస్తున్నందుకు టి.ఎన్.జి.ఓ లు ప్రతి జిల్లాలో సి.ఎం కృతఙతా సభలు పెడతామని, అదీ కరీంనగర్ నగర్ నుండి మొదలు పెడదామనడము, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యులు కాబోయే ఎన్.జి.ఓ లు ఎంత నిష్పక్షపాతంగా ఉండబోతారో అనడానికి నిదర్శనము.

ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు జరిగే ఈ అధికార దుర్వినియోగానికి కళ్లెం వేయకుండా నిష్ఫక్షపాత ఎన్నికలు జరుపలేదు.

అసెంబ్లీ, లొక్ సభ తో సహా ఏ స్థానానికైనా ఖాళీ ఏర్పడిన నాటి నుండే అధికార దుర్వినియోగం జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల కమిషన్ ఈ అధికార దుర్వినియోగం, కరోనా నిబందనలను ఉల్లఘింస్తూ చేసే ప్రచారాలను అరికట్టలేక పోతే వెంటనే ఎన్నికలను ప్రకటించాలి. అధికార దుర్వినియోగాన్ని, ప్రజాధన దోపిడిని అరికట్టాలి. కరొనా ముప్పునుండి ప్రజలను కాపాడాలి.

Niranjan G , Spokesperson,TSPCC

(జి.నిరంజన్, సీనియర్ ఉపాధ్యక్షులు,తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *