BSP లో చేరనున్నమాజీ IPS ప్రవీణ్ కుమార్

ఇటీవల ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసిన ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహజన్ సమాజ్ వాది పార్టీలో చేరుతున్నారు. ఆగస్టు 8న ఆయన పార్టీలోచేరుతున్నట్లు బిఎస్ పి వరంగ్ అర్బన్ జిల్లా కోశాధికారి  పరమేశ్వర్ దామెర ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఆయన చెప్పారు.

ఆగస్టు 8వ తారీఖున నల్గొండ జిల్లాలోని ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 లక్షల మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతం  సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చేరనున్నారని ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పేద వర్గాల ప్రజలు లక్షలాదిగా నల్గొండ జిల్లా ఎన్.జి కాలేజ్ మైదానానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్  మన బ్రతుకులు మార్చడం కోసం గొప్ప త్యాగం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకొని రావలసిందిగా ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *