బలిజ-కాపు రిజర్వేషన్ల కోసం పోస్టు కార్డు ఉద్యమం

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమలో 54 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలలో రాజకీయ నాయకుల గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో బలిజలు ఉన్నారని కానీ ఇక్కడ బలిజలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్ & పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ & రాయలసీమ జిల్లాల ఇంఛార్జ్ చందు శ్రీనివాస రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లోని డాక్టర్ బ్రహ్మరెడ్డి కాన్ఫరెన్స్ హాల్ నందు కాపు సంక్షేమ సేన కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  చందు శ్రీనివాస రావు  మాట్లాడుతూ బలిజ విద్యార్థులకు విద్యాపరంగా, యువతకు ఉపాధి కల్పన, జనాభా దామాషా ప్రకారం బలిజ కాపులకు దక్కాల్సిన రిజర్వేషన్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.

పాలకుల నిర్లక్ష్యం వలన ఉన్నత చదువులు కష్టపడి చదువుకుని రిజర్వేషన్ అందక కూలీ నాలీ చేసుకుని బలిజ కాపు యువత బతుకుతున్నారని అన్నారు.

“1915 నుండి 1956 వరకు బీసీలుగా ఉన్న బలిజ, కాపులను ఎలాంటి కమీషన్ సిఫారసు లేకుండా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలగించడం జరిగింది. తిరిగి 1961లో దామోదరం సంజీవయ్య  కర్నూలు జిల్లా నుండి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి పరిస్థితులను అధ్యయనం చేసి బలిజ కాపు లకు రిజర్వేషన్స్ పునరుద్ధరించడం జరిగింది.  1979లో ఏర్పాటు చేసిన మండల్ కమీషన్ కూడా బలిజ కాపులను బిసి జాబితాగా గుర్తించింది. నాటి నుండి నేటి వరకు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బలిజ కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని విస్మరిస్తున్నారు.  2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తరపున్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చి 2006లో దాళ్వా సుబ్రమణ్యం కమిటీని ఏర్పాటు చేసి స్వరేకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేసి అన్యాయం చేశారు. బలిజ కాపులను వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది.  కాపు కార్పొరేషన్ కు ఏటా రు. 2000 కోట్ల చొప్పున మూడేళ్లలో 6000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా యువతకు ఋణం ఇచ్చి ఉపాధి కల్పన కోసం కృషి చేయలేదు,” అని ఆయన అన్నారు.

బడుగు బలహీన వర్గాలతో కలిసి బలిజ కాపు తెలగల రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని, తమకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని బలిజలకు న్యాయ చేసే వారికే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

కాపు సంక్షేమ సేన సంస్థాగతంగా నియోజకవర్గ కమిటీ లో పూర్తి చేయడం జరిగిందని ఆ కమిటీల ద్వారా భవిష్యత్తులో బలిజల ఆర్థిక అభివృద్ధి రాజ్యాధికారం కోసం శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బలిజ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మాజీ హోం మంత్రివర్యులు పెద్దలు చేగొండి హరి రామజోగయ్య  కర్నూలు జిల్లా స్టూడెంట్ జెఎసి ఛైర్మన్ గా ఉన్న కోనేటి వెంకటేశ్వర్లుని కాపు సంక్షేమ సేన కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, కోనేటి వెంకటేశ్వర్లు నాయకత్వంలో కర్నూలు జిల్లాలో కోనేటి చంద్రబాబు, చింతలపల్లి రామ కృష్ణ  సలహాలతో ముందుకు తీసుకెల్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర సలహా కమిటీ సభ్యులు కోనేటి చంద్ర బాబు, ఉపాధ్యక్షులు చింతలపల్లి రామ కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బలిజ శ్రీరాములు, జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్, యువసేన కర్నూలు జిల్లా అధ్యక్షులు కొట్టె మల్లికార్జున, సోషల్ మీడియా కన్వీనర్ అరిగేల నగేష్, కర్నూలు జిల్లా బలిజ సంఘం పెద్దలు పత్తి ఓబులయ్య, డాక్టర్ విజయ శంకర్, కాపు సంక్షేమ సేన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గుర్రాల రామాంజినేయులు, జిల్లా కార్యదర్శి గల్లా రామచంద్ర, జిల్లా అసెంబ్లీ నాయకులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *