అవును, ఇది తెలంగాణ సర్కార్ బడే… ఎక్కడో తెలుసా?

 

సర్వహంగులతో కమలాపూర్ బిసి గురుకుల పాఠశాల

ఒకనాడు సర్కారు బడి అంటే సమస్యలకు నిలయాలుగా దర్శనమిచ్చేవి, కానీ స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ఆ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు చోటుచేసుకుంటన్నాయి.

సంక్షేమ గురుకులాల్ని ఏర్పాటు చేసి, ఎస్సీ,ఎస్టీలతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను ప్రభుత్వమే పూర్తి ఉఛితంగా అందిస్తుంది.

.విద్యతో పాటు మానసిక వికాసం, శారీరక దారుడ్యం, క్రీడోల్లాసం, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి సమగ్ర అంశాల మేలవింపుతో విధ్యార్థులకు అత్యుత్తమ సుశిక్షణను అందిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 261 స్కూళ్లు, 19 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ మెత్తం 281 గురుకులాల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ సంవత్సరం మరో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తుంది. ప్రతీ బిసి గురుకులంలో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేసుకొని వందకు వందశాతం డిజటలైజేషన్ బిసి గురుకులాలు సాధించాయి, విద్యా ప్రమాణాల్ని పెంచడం వల్ల క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ దూసుకుపోతున్నాయి.

తాజాగా ఆర్మీ, నేవీల్లోనూ బిసి గురుకుల విద్యార్థులు సెలక్టయిన విషయం తెలిసిందే. అనేక విద్యాలయాల్లో వందకు వంద శాతం రిజల్ట్ తో రాష్ట్ర సగటును మించి ఉత్తీర్ణతా శాతాన్ని సాధిస్తూ గురుకులాల విద్యార్థులు సొసైటీ పేరును నిలుపుతున్నారు.

ప్రభుత్వం సైతం వందల కోట్ల నిధులతో గురుకులాలను అభివ్రుద్ది చేస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తుంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ తో జరిగిన సమీక్షా సమావేశంలో వీటి గురించిన ఆసక్తికరమైన చర్చ కొనసాగింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తిచేసిన కమలాపూర్ గురుకుల విద్యాలయం నిర్మాణం కార్పోరేట్ కు దీటుగా నిలుస్తున్నది.

15 ఎకరాల సువిశాల విస్థీర్ణంలో 1,10,000 వేల చదరపు అడుగులతో రూ. 20 కోట్లు వెచ్చించి కట్టారు. ఇక్కడ బిసి విద్యార్థులకు సకల సౌకర్యాలను సమకూరుస్తున్నారు. భవనాలు, స్టాప్ క్వార్టర్స్, డైనింగ్ ఏరియా, లైబ్రరీ, లాబరేటరి, విశాలమైన ఆటస్థలం అన్నింటి కన్నా ముఖ్యంగా అహ్లదకరంగా తీర్చిదిద్దిన పచ్చని వాతావరణం… చదువులతో పాటు మానసికోల్లాసాన్ని అందించే విదంగా తీర్చిదిద్దారు.

రాష్ట్రంలో మరో 25 గురుకులాలు సైతం ఇదే రీతిలో నిర్మాణ దశలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *