ఐదవ రాయలసీమ మహా కవిసమ్మేళనం-2021

రాయలసీమ పర్యావరణ, విజ్జాన అంశాల నేపథ్యంగా
రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన& అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో  ఆగస్టు 1 వ తేదీన అంతర్జాల వేదిక గా ఐదవ రాయలసీమ మహాకవిసమ్మేళనం  జరుగుతున్నది. ఈ విషయాన్ని ఈ కార్యక్రమం సమన్వయ కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి ఉన్నవారెరైనా  ఈ మహా కవి సమ్మేళనంలో పాల్గొనవచ్చు. అయితే, రాయలసీమ భౌగోళికం, వాతావరణం, పర్యావరణం, సహజ వనరులు, జీవ వైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానం తదితర అంశాల నేపధ్యంగా కవితలను రాసి  25 జూలై లోపు 99625 44299 ఫోన్ నెంబర్ కు పంపాలని నిర్వహాక బృంద సభ్యులు యస్. వాసంతి, రాజశేఖరరెడ్డి, రవికుమార్, డా. దామోదర రెడ్డి, డా. వెంకట నరేంద్ర ప్రసాద్, నిర్మల, శైలజ లు కోరుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *