శ్రీవారి భక్తులకు శుభవార్త, ఆన్ లైన్ టికెట్లు వస్తున్నాయ్

తిరుమల: జూలై  20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతి బాలాజీ. ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *