నదీజలాల గొడవ మధ్య జనసేనాని ఇలా ఈ రోజు విజయవాడలో దిగారు…

జనసేనాని పవన్ కల్యాణ్  విజయవాడలో దిగారు.  ఆయన ఈరోజు పార్టీ కార్యాలయంలో పలు సమావేశాలలో పాల్గొంటారు. కృష్ణాజలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్నపుడు ఆయన కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు. కృష్ణా జలాల వివాదం గురించి పార్టీ నేతలో చర్చించి ఒక ప్రకటన విడుదలచేసేందుకే ఆయన విజయవాడ వచ్చారని తెలిసింది.

అన్ని పార్టీలు కృష్ణా జలాల మీద తెలంగాణ వైఖరిని విమర్శిస్తూ తమ విధానాలు ప్రకటించారు.

ఆయన ఇంతవరకు తన సహజ శైలిలో కృష్ణాజలాల మీద ఉన్న ఆంధ్రుల హక్కుల గురించి గొంతెత్త లేదు.

ఇక అటువైపు  అన్ని పార్టీలు కృష్ణా జలాల మీద తెలంగాణ వైఖరిని విమర్శిస్తూ నేతలంతా తమ విధానాలు ప్రకటించారు.

రైతుల సంఘాలు కూడా సమావేశాలు, చర్చలు పెట్టి తెలంగాణ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. తెలంగాణ వైఖరిని, ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. అదే విధంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి జరిపిన స్నేహం వల్లే ఈ ముప్పు వస్తాందని,  ఆయన గట్టిగా పోరాడలేక పోతున్నారనే విమర్శ కూడా ఉంది.లాగే బిజెపికి కూడా జగన్ ని విమర్శిస్తూ తెలంగాణ వైఖరిని తప్పు పడుతూ ఉంది.

ఇక తెలంగాణ  మంత్రులు ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రంగా క్యాంపెయిన్ చేపట్టారు. ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ ఆర్  కృష్ణాజల దొంగ అని,  ఆయన కుమారుడు జగన్ గజ దొంగ అని రోజూ విమర్శిస్తున్నారు. ఇ

ఈ నేపథ్యంలో పవన్ విజయవాడలో పార్టీ నేతలతో సమావేమవుతున్నారు. ఆయన ఏమ్మాటడతారో, ఎలాంటి ప్రకటన  చేస్తారో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *