సీనియర్లందరిని మచ్చిక చేసుకుంటున్న రేవంత్

కొత్తగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న అనుముల రేవంత్ రెడ్డి చాలా వడుపుగా ముందుకు పోతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనని నియమించడం పట్ల  అసంతృప్తితో ఉన్న సీనియర్లందరిని నివాసాలకు వెళ్లి కలుసుకుని  ఆశీస్సులు కోరుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకుంటున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు ఆయన పిసిసి పరుగులో ఉన్ననేతలను ఇతర సీనియర్ లను కలుకున్నారు. ఆయన కలుసుకున్నవారిలో మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి, మాజీ మంత్రి డి శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్ పి నాయకుడు భట్టి విక్రమార్క మల్లు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *