ఆంధ్రాలో భారీ పెట్టుబడులకు ఆమోదం, ఉద్యోగాలు 75 % స్థానికులకే…

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో పలుకంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు పంపించాయి. వాటికి బోర్డు ఆమోదం తెలిపింది. వీటిలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగాా ఆదేశించారు.

బోర్డు ఆమోదించిన  పెట్టుబడుల వివరాలు:

– కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపోనెంట్స్‌ లిమిటెడ్‌కు అంగీకారం,  ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు ఇక్కడ తయారీ, ఈ పరిశ్రమవల్ల ప్రత్యక్షంగా 2వేల మంది ఉద్యోగాలు, మొత్తంగా రూ.401 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ

– కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్‌కమల్‌ లిమిటెడ్‌కూ బోర్డు అంగీకారం.

– నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు. అన్నికంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నీల్‌కమల్‌. రూ. 486 కోట్ల పెట్టుబడి పెట్టనున్న నీల్‌కమల్‌. ప్రత్యక్షంగా 2030 మంది ఉద్యోగాలు. ఫర్నీచర్‌ మరియు ఇతర గృహోపకరణాల తయారీ.

– నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం.  ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్‌ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు అందిస్తున్న గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌.  జపాన్, కొరియాలకు చెందిన అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ. జర్మనీ నుంచి ఐఎల్‌టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్న గ్రీన్‌టెక్‌. ప్రస్తుతం 2700 మందికి ఉద్యోగాలు, విస్తరణ ద్వారా అదనంగా 2200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు.

చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు బోర్డు అంగీకారం. సుమారు 30 కోట్ల పెట్టుబడి, 2304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు, పురుషులు, పిల్లల బట్టలుతయారీ

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల వద్ద జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు ఇచ్చేందకు ఎస్‌ఐపీబీ ఆమోదం,  2.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ ఏర్పాట్లు, తద్వారా 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు

-విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం. కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచాలని కోరిన సెయిట్‌ గోబియాన్‌, జూన్‌ 2022 వరకూ పెంచుతూ నిర్ణయం, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్క్‌ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఆమోదం

– గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల స్థలంలో రిటైల్‌ బిజినెస్‌ పార్క్‌
రూ. 194.16 కోట్ల పెట్టుబడి, పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్‌ యూనిట్స్‌, సుమారు 5వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 20వేల మందికి పరోక్ష ఉద్యోగాలు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్‌ ఏర్పాటు, రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70శాతం విక్రయాలు ఇక్కడ నుంచే జరుగుతాయని అంచనా
పార్క్‌లో భాగంగా ఏర్పాటవుతున్న స్టోర్స్‌ నుంచి ఒక్కో స్టోర్‌లో ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా

ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *