జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

2021 జూలై నెలలో తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే విశేష ఉత్సవాలు

– జూలై 5న సర్వఏకాదశి.

– జూలై 6న వ‌సంత‌మండ‌పంలో రావ‌ణ‌వ‌ధ ఘ‌ట్ట పారాయ‌ణం.

– జూలై 14న శ్రీ మరీచి మహర్షి వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం.

– జూలై 16న శ్రీ‌వారి ఆణివర ఆస్థానం.

– జూలై 20న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.

– జూలై 21న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.

– జూలై 24న వ్యాస‌జ‌యంతి, గురుపూర్ణిమ‌, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం.

 

జూలై 1వ తేదీ నుండి బర్డ్ లో ఓపి సేవలు పునః ప్రారంభం
తిరుపతి, 2021 జూన్ 28: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ గురువారం నుంచి ఓపి, ఇన్ పేషంట్‌ సేవలు పునఃప్రారంభించ‌నున్న‌ట్లు   ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన కేసులు అడ్మిట్ చేసుకుంటామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *