స్పీకర్ కు రాజీనామా లేఖ ఇవ్వలేకపోయిన ఈటెల, కెసిఆర్ కుహెచ్చరిక

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన  రాజీనామా లేఖని స్వయాన స్వీకర్ కి ఇవ్వలేకపోయారు. రాజీనామా చేసేందుకు ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చినా స్పీకర్ పోచారం శ్రీనివాాసరెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. కరోనా కారణంగా ఆయన కార్యాలయానికి రావడం లేదు. దీనితో ఈటెల అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు,

సంప్రదాయం ప్రకారం స్పీకర్ కి రాజీనామా చేయాలనుకున్న సభ్యుడు స్వయంగా నిర్దేశించిన ఫారమ్ మీద సంతకం చేసి ఇవ్వాలి. పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా పంపితే చెల్లదు. ఈ మధ్య స్పీకర్లు పర్సనల్ వెరిఫికేషన్ చేయాలంటూ  ప్రత్యక్షంగా కలుసుకోవాలని సభ్యులను కోరుుతున్నారు.అందువల్ల అసెంబ్లీకి ఈటెలమరొకసారి రావలసి ఉండొచ్చు.

అసెంబ్లీకార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించిన తర్వా త మీడియా పాయింట్ లో  ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు.

‘నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ అందించాలని భావించాను.కానీ ఆ అవకాశం చిక్కలే.  నేరుగా స్పీకర్ గారికి ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ గారు కరోనా అడ్డం పెట్టుకొని కలవలేదు. అనివార్య మైన పరిస్థితుల్లో సెక్రెటరీ కి ఇచ్చాను,’ అని చెప్పారు.

అసెంబ్లీ లో అంతా నియంతృత్వమే సాగుతూ ఉందని, గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు అన్నీ తుంగలో తొక్కారని,మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి నీ కూడా  లోనికి అనుమతించలేదని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ ప్రజల ఆశలను ప్రతిబింబించాలి కానీ ఇక్కడకూడా కెసిఆర్ గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతున్నదని ఆయన చెప్పారు.

ఈటెల ఇంకా ఏమన్నారంటే…

కెసిఆర్ గారు, ఈ రాజ్యాంగం ఎంది, ఎమ్మెల్యే ఎంపీ లు ఎంటి అనే భావనలో ఉన్నారు, దాని ప్రతి బింబమే ఈ రోజు మాకు అసెంబ్లీలో  ఎదురైన అనుభవం.  ఈ వెకిలి చేస్టలు, నకిలీ ప్రయత్నాలు ఆపకపోతే నీకే ఎదురు తిరుగుతాయి.

చిల్లర ప్రయత్నాలు సాగవు

హుజూరాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు కానీ ఇప్పుడు ఆగ మేఘాల ఎన్నికల కోసం  మీద పెన్షలు ఇస్తున్నారు. నాకు మద్దతు తెలపక పోతే ఆపెస్త అంటున్నారు అట నే ఇంట్లో నుండి ఇవ్వడం లేదు గుర్తు పెట్టుకో..

హుజూరాబాద్ చైతన్యం గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తరు. ధర్మ అధర్మం, డబ్బు సంచులకి ఆగౌరవనికి మధ్య జరిగే పోరాటం. నా DNA అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్షం గా రైట్ పార్టీలో చేరుతున్న. మళ్లీ గెలిచి ఏనుగు, తుల ఉమ, అందే బబాన్న, vk మహేశ్, కేశవ రెడ్డి, గండ్ర నళిని, సత్యనారాయణ తో పాటు అనేక మందిమి బిజెపిలో చేరుతున్నాము. ఆ తరువాత అన్ని జిల్లాల నుండి వెలాదిగా చేరుతారు.

లెఫ్ట్ సంఘాలు కూడా సంఘీభావం అందిస్తున్నాయి. RSU నుండి RSS వరకు అందరూ నియంత పాలన అంతమొందించడానికి కలిసి వస్తున్నారు.
20 ఏళ్ల తరువాత 2021 లో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమం మొదలు పెడుతున్నాము.

కేటీఆర్ 2018 లోనే ఉత్తమ్ సోదరుడు కౌశిక్ రెడ్డి కి డబ్బులు పంపించి నన్న ఓడ గొట్టడనికి ఎపుడో  ప్రయత్నం చేశారు. నా ఇంటిమీద రైడ్ చేయించారు. ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు.

ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు. బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు. నన్ను కాల గర్భంలో కలపాలి అనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతుంది. నియంత పాలన అంతం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *