ఎన్టీఆర్ కు షర్మిల నివాళి…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, తొందర్లో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీ రామారావుకు ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా వాళులర్పించారు. ఎన్టీఆర్ కాలం సంక్షేమానికి స్వర్ణయుగమని తెలంగాణ బిసి సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ రాసిన ఒకవ్యాసం టాగ్ చేస్తూ ఆమె రామారావు నివాళులర్పించారు.
“పటేల్..పట్వారి వ్యవస్థలను రద్దు చేసి..బిసి లకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు..మహిళలకు ఆస్థి హక్కు కల్పించి..రెండు రూపాయలకే కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన..నందమూరి తారక రామారావు గారిని..
వారి జన్మదినం సందర్భగా..వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది,” అని షర్మల ట్విట్టర్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *