ఆంధ్రలో 16,167 కొత్త కరోనా కేసులు, 104 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో  16,167 మందికి కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రం మొత్తంగా  84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.

దీనితో ప్రస్తుతం  రాష్ట్ంలో ఉన్న యాక్టివ్ కేసులు  1,86,782లకు చేరుకున్నాయి.

గత 24 గంటల్లో 21,385 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 46 వేల 244 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,89,24,545 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో 14, ప.గో.జిల్లాలో 13, గుంటూరు, విజయనగరం జిల్లాలో 8.. అనంతపురం, నెల్లూరులో 9, ప్రకాశంలో 7, విశాఖ జిల్లాల్లో 11 మంది, తూ.గో లో ఆరుగురు, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున మొత్తం 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10531 మంది మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *