ఆంధ్రలో నిన్న కోవిడ్ మరణాలు 108

ఆంధ్రలో కోవిడ్ మరణాలు నిన్న బాగా పెరిగాయి.  గత 24 గంటలలో కోవిడ్ వల్ల రాష్ట్రంలో 108 మంది చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఇంతవరకు మరణంచిన వారి సంఖ్య 8,899 కి చేరింది.  కింది చిత్రంలో పూర్తి సమాచారం ఉంది.

86,878 శాంపిల్స్ పరీక్షిస్తే  20,345 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మరణాలకు సంబంధించిచిత్తూరు జిల్లాలో  18మంది చనిపోయారు. విశాఖలో 12 మంది, తూ.గోదావరి జిల్లాలో 20, గుంటూరుజిల్లాలో 10, విజయనగరంజిల్లాలో 10 మంది, ప్రకాశంలో జిల్లాలో 9, నెల్లూరులో 8.కృష్ణలో ఏడుగురు,శ్రీకాకుళంలో 6గురు, అనంతపూర్ లో 5 గురు, కర్నూల్ ల్ ఐదుగురు,  పశ్చిమగోదావరి జిల్లాలో ఐదుగురు, కడపలో ముగ్గురు మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *