టెస్టులు తగ్గించి కోవిడ్ కేసులు తగ్గాయంటారా, ఇదేంటి?: హైకోర్టు

తెలంగాణ కరోనా పరిస్థితుల పై హైకోర్టు విచారణ

రాష్ట్రంలో టెస్టులు సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారని హైదరాబాద్  హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ వ్యాప్తి నిర్ధారించుకునేందుకు టెస్టులు ఎందుకు పెంచడం లేదని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఏ ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని కోర్టు వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని, లాక్ డౌన్ దిశ గా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం లో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని ప్రశ్నిస్తూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని హైకోర్టు సూచనలిచ్చింది.

తెలంగాణలో  600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డిమాండ్ ఉందని కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని డైరెక్టర్ పబ్లిక్ హెల్త్  ఆఫీసర్ శ్రీనివాస్ రావు.ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామని తమిళనాడు నుండి రావాల్సిన 55 మెట్రిక్ టన్స్  ఆక్సిజన్ రాలేదని  శ్రీనివాస్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *