ఆంధ్రలో పాక్షిక కర్ఫ్యూ మొదలు , తొలి రోజు రాజమండ్రి చిత్రాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి కరోనా పాక్షిక కర్ఫ్యూ మొదలయింది.రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో ట్రాన్స్ మిషన్ చెయిన్ బ్రేక్ చేసేందుకు రాష్ట్రం మధ్యాహ్నం 12 నుంచి మరుసటి ఉదయం6 దాకా కర్ఫ్యూ విధించారు. ఈ నెల 18 దాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. దీనిని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులను తప్ప బయట జనసంచారాన్ని అనుమతించడం లేదు. అంతర్రాష్ట్ర ఆర్టీసి బస్సులు కూడా ఆగిపోయాయి. వివాహాలకు 20 మంది రావచ్చని చెప్పినా, కార్యక్రమానికి అధికారులనుంచి అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించారు.  కోస్తా ప్రాంతంలో ప్రముఖ నగరమయిన రాజమండ్రిలో కర్ఫ్యూ ను పోలీసులు అమలుచేస్తున్న ఫోటోలు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *