తెలంగాణ మంత్రి పువ్వాడ కరోన పాజిటివ్

 

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా పాజిటివ్‌ అని  తేలింది. తేలికపాటి కోవిడ్  లక్షణాలు ఉండటంతో నిన్న(శుక్రవారం) RT-PCR పరీక్ష నిర్వహించగా నేడు(1.5.2021)న రిజల్ట్ పాజిటివ్ వచ్చింది.

దీనితో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని  ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన  వెల్లడించారు.

తనతో గడచిన వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  త్వరలోనే యధావిధిగా ప్రజల  మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *