కోవిడ్ నుంచి కోలుకుంటున్న కెసిఆర్

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనానుంచి కోలుకుంటున్నారు.  ఆయన  వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు సీఎంకు  ఇసోలేషన్ లో వున్న వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.  రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో  రాపిడ్ టెస్టులో నెగటివ్ అని రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.

కెసిఆర్ కరోనా పాజిటివ్ అని  పరీక్షలలలో తెలిందని ఏప్రిల్ 19 వ తేదీన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటన విడుదలచేశారు. దీనితో ఆయన ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. తర్వాత ఆయనకు హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో అన్నిరకాల పరీక్షలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *