రాహుల్ గాంధీ కూడా కోవిడ్ పాజిటివ్

దేశ రాజధానిలో  రాజకీయ ప్రముఖులను కోవిడ్ చుట్టు ముడుతున్నదనిపిస్తుంది. మంగళవారం నాడు  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కోవిడ్ పాజిటివ్ అనే నిర్ధారణ అయింది. కొద్దిగా సుస్తీ లక్షణాలు కన్పించడంతో ఆయనకు కరోనా పరీక్ష జరిగింది. అందులో ఆయన పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

 

ఇప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాజిటివ్ అయ్యారు. తర్వాత  ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కూడా కోవిడ్ పాజిటివ్  అని తేలడంతో వారు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.

మంగళవారం నాడు దేశంలో 2,59,170 కొత్త కరోనా కేసులు రికార్డు అయ్యాయి.కోవిడ్ తో 1761 మరణాలు సంభవించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *