12.71 కోట్ల ప్రజలకు అందిన కోవిడ్ వ్యాక్సిన్…

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 12.71 కోట్లు దాటింది. ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 18,83,241 శిబిరాలద్వారా 12,71,29,113 టీకా డోసులు ఇవ్వగా అందులో 10,96,59,181 మొదటి డోసులు, 1,74,69,932 రెండో డోసులు ఉన్నాయి.

ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 91,70,717 మొదటి డోసులు,  57,67,657 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న  1,14,32,732 మొదటి డోసులు,   56,86,608 రెండో డోసులున్నాయి.

60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్నవి  4,66,82,963 మొదటి డోసులు, 47,04,601 రెండో డోసులు.  45-60 ఏళ్ల మధ్య వారు

తీసుకున్నవి 4,23,72,769 మొదటి డోసులు, 13,11,066 రెండో డోసులు ఉన్నాయి.

ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలో 59.33% వాటా ఎనిమిది రాష్ట్రాలదే.

 

గడిచిన 24 గంటలలో మొత్తం 32 లక్షలకు పైగా కోవిడ్ టీకాలిచ్చారు.  టీకాల కార్యక్రమం మొదలైన 94వ రోజైన ఏప్రిల్ 19 నాడు 32,76,555 టీకాలిచ్చారు.  అందులో  22,87,419 మంది లబ్ధిదారులు 45,856 శిబిరాలద్వారా మొదటి డోస్ అందుకోగా 9,89,136 మంది రెండో డోస్ తీసుకున్నారు.

భారతదేశంలో కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో  2,59,170 కొత్త కేసులు నమోదయ్యాయి.

పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ, కర్నాటక, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళ నాడు, గుజరాత్, రాజస్థాన్  లలో 77.67% కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 58,924 కొత్త కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న  ఉత్తరప్రదేశ్  లో  28,211, ఢిల్లీలో  23,686 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *