హైదరాబాద్ : ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రాలేదు

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ సెగ్మెంట్‌లో ఏడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది.  దాంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ లెక్కింపులో ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రాలేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సెగ్మెంట్‌లో మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వీటిని తీసేస్తే 3,37,039 ఓట్లను కౌంట్ చేశారు. అయితే అభ్యర్థి గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,68,521. కానీ, ఏ అభ్యర్థి ఈ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేదు.తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 1,12,689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 1,04,668 ఓట్లు వచ్చాయి. ఇండింపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *