అమరావతి యుద్ధం మొదలు… చంద్రబాబుని ఒక్క రోజైనా జైలుకు పంపిస్తారా?

అమరావతి యుద్ధానికి రంగం సిద్ధమయినట్లే. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఈ యుద్ధం ప్రారంభించేందుకు తీర్పుగా ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లున్నారు.

ఫలితాలు వచ్చిన 48 గంటల్లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సిఐడి నోటీసులుందించి విచారణకు సిద్ధం గా  ఉండాలని సిఐడి  చెప్పింది.

తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంతో వైసిసి నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏడాదిగా  అమరావతి పరిరక్షణ కమిటీ ఉద్యమం సాగుతున్న ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అధిక్యత సాధించ లేకపోవడం, మునిసిపల్ ఎన్నికల్లో విజయవాడలో కూడా వైసిపి జండా ఎగరవేయడం తో టిడిపి అలుసయిపోయింది. దానికి తోడు విశాఖలో  వైసిపి ఘనవిజయం సాధించింది. దీనితో పాలనా  రాజధానిని విశాఖ తరలింపు ప్రతిపాదన వ్యతిరేకతని  ప్రజలు తిరస్కరించారని  వైసిపి బలంగా చెబుతున్నది.

ఈ అఖండ విజయంతో మిగతా అన్ని విమర్శలు కొట్టుకుపోయాయి. ప్రజలు  కొన్నాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదాన్ని కూడా మార్చిపోతారు. కేంద్రం ప్రయివేటీకరణ పనిని ఆంధ్రుల కోడలి చేత్తోనే పూర్తి చేయిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఏదో విధంగా కనీసం ఒక రోజయినా పోలీసు కస్టడీకో, జ్యుడిషియల్ రిమాండ్ కో పంపేందుకు సన్నాహాలను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది.

మాజీ ముఖ్యమంత్రి  మీద 10 సెక్షన్ల కింద నోటీసులివ్వడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల లు పెట్టడం జరిగింది. సెక్షన్ 41 సిఆర్ పిసి కిింద ఆయనకు నోటీసులిచ్చారు. ఈ నెల 23న ఉదయం పదకొండు గంటలకు విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రమ్మన్నారు.ఈ  సారి ఈ ప్రాసెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో మొదలయింది. గత నెలలో ఆళ్ల సమర్పించిన ఫిర్యాదు మీద విచారణ జరిగింది.దీనిలో దొరికిన ఆధారాలు చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చారు. విచారణ మొదలయితే, విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు. ఈ సారి కోర్టులు చంద్రబాబు నాయుడిని ఎంతవరకు ఆదుకుంటాయో చూడాలి. ఈ పరిణామాల మధ్య సిఐడి నోటీసుల మీద తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందించారు.

(కింజరాపు అచ్చెన్నాయుడు)

తెలుగు దేశం హయాంలో అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని  అమరావతి రాజధాని కోసమే ఉపయోగించాము. దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.

రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చాము. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపుకాదా? జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారు. అసైన్బ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారు. దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది. వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదు.

రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టాం. ఎక్కడా సొంత ప్రయోజనాల కోసం తీసుకోలేదు. రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగింది. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్దు భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే

ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు. ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా? అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్‌. కాదనగలరా? ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారు.

(ఇది అచ్చన్నాయుడు విడుదల చేసిన ప్రెస్ నోట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *