శర్వా టెర్రిఫిక్ ఫస్ట్ లుక్!

ఈ రోజు శర్వానంద్ బర్త్ డే. ఆయన 37 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులుస్నేహితులుటాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో  ముంచెత్తుతున్నారు.

ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని శర్వానంద్  రాబోయే చిత్రం మహాసముద్రం‘ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు నిర్మాతలు. శర్వానంద్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో రణరంగంలో ఆయుధం పట్టుకుని టెర్రీఫిక్ గా వున్న ఈ ఫస్ట్ లుక్ నిమిషాల్లో వైరల్ అయింది.

అభిమానులు ఆనందంతో పిచ్చెత్తిపోతూ కామెంట్లు  కురిపిస్తున్నారు.  విశాఖపట్నం నేపథ్యంలోద్విభాషా చిత్రంగా రూపొందుతున్న మహాసముద్రం‘ లో అదితిరావు హైదరి, అనూ ఇమ్మాన్యయేల్ శర్వానంద్ కి జోడీగా నటిస్తున్నారు. మెయిన్ షెడ్యూల్ ఇటీవల గోవాలో పూర్తయింది. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం షూట్‌లో పాల్గొంటోంది.

ఇంటెన్సివ్ రోమాంటిక్ థ్రిల్లర్ గా ఇప్పటికే ఆసక్తి రేపుతున్న మహాసముద్రం‘ ఆగస్టు 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

శర్వానంద్ గత చిత్రం సమంతా అక్కినేనితో ‘జాను గత సంవత్సరం విడుదలైన విషయం తెలిసిందే. ఇది తమిళ 96 కి రీమేక్. కాగా మహాసముద్రం కి దర్శకుడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి. నిర్మాత అనిల్ సుంకర. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *