ఇంకా తెగని చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు

టిఆర్ ఎస్ వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన కేసును ఈ  రోజు హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.  జర్మనీ పౌరసత్వం గురించి ఆ దేశ అధికారిక సమాచారాన్ని చెన్నమనేని కోర్టు కు సమర్పించారు.  ఈ మేరకు డిసెంబరు 15, 2020 న అపిడవిట్ దాఖలు చేశారు.

వేములవాడ ఎన్నికల్లో  ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేసి రమేష్ పౌరుసత్వాన్ని ప్రశ్నించారు. ఆయన భారత దేశం పౌరసత్వం చెల్లదని, ఆయన ఇంకా జర్మనీ పౌరుడని చెబుతూ ఆయన ఎన్నికల చెల్లదని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది.

చెన్నమనేని రమేష్ తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లో ప్రవేశించారు.  2009లో వేముల వాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2010 లో టిఆర్ ఎస్ లో చేరారు. అపుడు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. తర్వాత 2014, 201 8 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ఆయన దంద్వ పౌరసత్వం కేసు కోర్టు దాకా వచ్చింది.

ఆయన భారత్ ను మోసగించి తనకు జర్మనీ పౌరసత్వం ఉన్నా భారత పౌర సత్వం మోసపుచ్చి (by playing fraud upon the government) తీసుకున్నాడనేది ఆరోపణ.  2008 భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తున్నపుడు తాను స్థిరంగా ఇక్కడ నివసించడంలేదన్న విషయాన్ని కప్పిపుచ్చారని భారత హోం శాఖ ఆరోపించింది.

రమేష్  కరీం నగర్ జిల్లా కుచెందిన ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు.  1987లో ఆయన ఉన్నత చదువుల కోసం  జర్మనీ వెళ్లారు. హంబోల్ట్ విశ్వవిద్యాలయంలో  డాక్టొరేట్ పూర్తి చేశారు. తర్వాత అక్కడే స్థిరపడ్డారు. 1993లో ఆయన జర్మనీ పౌరసత్వం వచ్చింది.

జర్మనీలో కమ్యూనిజం కూలిపోవడంతో ఆయన మళ్లీ ఇండియా వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత  సిహెచ్ రాజేశ్వరరావు సిపిఐ నుంచి బయటకు వచ్చాక టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రమేష్ ఆయన వారసత్వం తీసుకున్నారు. ఇక్కడే పౌరసత్వం వివాదం వచ్చింది. జర్మనీ పౌరుడిగా ఆయన ఎన్నికల్లో పోటీ  చేసేందుకు వీల్లేదు. అపుడు ఆయన భారత పౌరసత్వానికి మార్చి 2008లో దరఖాస్తు చేసుకున్నారు.

ఈ సమయంలో ఆయన తాను భారత్ లో నివసించకపోయినా నివసిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని హోంశాఖ పేర్కొంది. 2009లో  ఎన్నికల్లో గెలిచాక ఆయన ప్రత్యర్థి  ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ హోంశాఖ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇపుడు సాగుతున్న విచారణ దాని పర్యవసానమే.

2013లో హైకోర్టు రమేష్  అసెంబ్లీ ఎన్నికను రద్దు చేసింది.  ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి కండిషనల్  స్టే తెచ్చుకున్నారు. అంటే సభ్యుడిగా కొనసాగవచ్చు. అయితే, ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదు. 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని భారత హాం శాఖ ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని రమేష్ వేసిన పిటిషన్ ను 2017 డిసెంబర్ లో హోం శాఖ కొట్టి వేసింది.

హోం శాఖ చెన్నమనేని ద్వంద పౌరసత్వం గురించి జర్మని రాయబార కార్యాలయన్ని సంప్రదించినప్పుడు ఆయన జర్మనీ పౌరుడు కాదని తేల్చింది. పాత పాస్ పోర్టు ఉపయోగించిన మాత్రాన చెన్నమనేని జర్మని పౌరుడు కాడని జర్మనీ చెప్పింది.

అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటే వాదనలు  వింటామని ఈ రోజు న్యాయమూర్తి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా తాము హాజరవుతామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

పౌరసత్వ చట్టం సెక్షన్ 5 ప్రకారం చెన్నమనేని తను భారత పౌరసత్వం పొందిన సమాచారాన్ని 3.3.2009 నాడు జర్మనీ కి తెలియ చేశారు.  ఈ సమాచారాన్ని   13.2.2020 నాడు మరోసారి ధ్రువీకరిస్తున్న పత్రాన్ని 15.12.2020 నాడు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించారు.

1993 లొ చెన్నమనేని స్వచ్చందంగా జర్మని పౌరసత్వం తీసుకున్నప్పుడు భారత పౌరసత్వం ఎలాగయితే కోల్పోవడం జరిగిందో అదేవిధంగా 2009 లొ మళ్ళి స్వచ్చందంగా భారత పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయారని చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *