విశాఖలో చంద్రబాబు… ఉక్కు సత్యాగ్రహానికి మద్దతు (గ్యాలరీ)

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకున్నారు. వైజాగ్ ఉక్కు పరిరక్షణ   కోసం హాస్పిటల్ లో నే దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శ్రీనివాస్ ఆరు రోజులుగా  విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటంతో పోలీసులు నిన్న ఆర్ధరాత్రి దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు. అందుకే ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు విశాఖ వచ్చారు.

మెల్లిగా మెల్లిగా విశాఖ లో ఉక్కు సెగలు మొదలవుతున్నాయి. ఇపుడు పల్లా శ్రీనివాస్ దీక్ష ప్రధాన వార్త అవుతూ ఉండటంతో జనం దృష్టి ఆకట్టుకునేందుకు వైసిపి పోటీ ఉద్యమం నడపబోతున్నది.పార్టీ నేత , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాదయాత్ర జరిపి స్టీల్ ప్లాంట్ ఎదుట నిరసన చేపట్టబోతున్నారు.

https://trendingtelugunews.com/top-stories/breaking/ycp-rs-member-vijayasai-reddy-padayatra-for-vizag-steel/

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/list-of-mlas-resigined-from-assembly-for-vizag-steel-in-1966/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *