7న రాష్ట్రపతి కోవింద్ మదనపల్లె రాక‌

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈనెల 7వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లె, సాడమ్ ప‌ర్యటనకు వస్తున్నారు.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 7వ తేది మధ్యాహ్నం చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ యోగశాల,భారత్ యోగ విద్యా కేంద్రాన్నిప్రారంభిస్తారు.

అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంఖుస్థాపన చేస్తారు.  తదుపరి సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటిస్తారు.

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం అమరావతి సచివాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్  సమీక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *