జోరుగా యాదాద్రి పనులు…

ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా  యాదాద్రిని తీర్చిదిద్దే పనులు చకచకా సాగుతున్నాయి.  ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి..ప్రెసిడెన్షియల్ సూట్,వివిఐపి 13 విల్లాలు ఈ నెల లోపు పూర్తి కానున్నాయి. ఈమేరకు పనులే వేగవంతం చేయాలని  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచనలిచ్చారు. ఈ రోజ యాదాద్రి నిర్మాణ పనులను సమీక్షించారు.
భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి,కళ్యాణకట్ట పనులు ఈనెలలోపు పూర్తి చేయాలి.143 కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని.యాదాద్రి పనుల రోజువారీ వర్క్ చార్ట్ తయారు చేసుకోవాలని.ప్రతివారం పనుల పురోగతి పై ఈఎన్సీ సమీక్ష నిర్వహించాలని చెప్పారు.
 యాదాద్రి పరిసర ప్రాంతాలు అంత పచ్చదనంతో పరిఢవిల్లేలా చూడాలి.పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండాలని అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
యాదాద్రి రింగ్ రోడ్డు పనుల కోసం భూసేకరణ ఈ జనవరి నెలలోపు పూర్తి చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కి ఫోన్ల సూచనలిచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో ఈ అడ్ సి గణపతి రెడ్డి,ఈ.ఈ వసంత నాయక్,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ,పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *