విజయవాడ న్యూ ఇయర్ రికార్డు

విజయవాడ కొత్త రికార్డు సృష్టిస్తూ కొత్త సంవత్సరం 2021కి స్వాగతం పలికింది.  పాత సంవత్సరం కోవిడ్ చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు  రు. 104 కోట్ల మద్యం సేవించి 2021 కి స్వాగతం పలికారు.
ఒకే రోజు మద్య అమ్మకాలు తీసుకుంటే ఇదొక రికార్డు అని అధికారులు చెబుతున్నారు.
కొత్త సంవత్సరం సందర్బంగా తెలంగాణలో లాగా ఆంధ్రలో లిక్కర్ షాపుల టైమింగ్ పెంచకపోయినా, ప్రజలు ఓపిగ్గా ఉన్న టైంలోనే క్యూలోనిలబడి మందు కొన్నారు. అందుకే ఇది రికార్డు సేల్ అంటున్నారు. ఎపి స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అందిస్తున్న వివరాల ప్రకారం కొత్త సంవత్సానికి విజయ ప్రజలు రు 104 కోట్ల మద్యం తో చీర్స్ కొట్టారు. ఇందులో  98.40 కోట్ల మద్యం వైన్ షాపులలో సేల్ అయితే, మిగతాది  బార్స్ లో ప్రవహించింది. సాధారణంగా ఆంధ్రలో బార్లు, లిక్కర్ షాపుల్లో   సగటున రోజుకు రు. 55 కోట్ల నుంచి  రు.65 కోట్ల దాకా సేల్ అవుతుంది. వారాంతంలో ఇది రు. 70 కోట్లు మించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *