జగన్ సంవత్సరాంతపు ఆదేశాలు ఇవే…

అమరావతి:  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి కిందట తన  కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు, బాగా వివాదమయిన  రామతీర్థం  విగ్రహం  ధ్వంసం తదితర అంశాల గురించి ఇందులో చర్చించి కీలకమయిన అదేశాలు జారీ చేశారు. ఆదేశాలివే:
*అర్హత ఉండి కూడా ఇంటిపట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు:
* పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే పట్టాలు ఇప్పించాలి
*అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం మనది కాదు
*మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. అదే సమయంలో అనర్హల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
*పెన్షన్, బియ్యంకార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి.
*అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యంకార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం.
* ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలి.
*ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలి.
* ఎన్ని రోజులు ఈసేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనేది మరోసారి పరిశీలన చేయండి.
* అమ్మ ఒడి పథకానికి అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలి.
* విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణం.  దేవుడితో చెలగాటమాడితే కచ్చితంగా దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *