ఢిల్లీ రైతులతో శ్రుతి కలిపిన ఆంధ్రా రైత నేతలు

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేస్తూ ఢిల్లీ-హర్యానా   సింఘు సరిహద్దు  రైతు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సంఘీభావం భారీగా వ్యక్తమవుతున్నది. పలు ప్రతినిధి బృందాలు వెళ్లి అక్కడి రైతులను కలసి , వారితో బైటాయించి సంఘీభావంచెబుతున్నారు.
ఈ రోజు మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వర రావు నేతృత్వంలోని రైతు నేతల బృందం సింఘు సరిహద్దుకు చేరుకుని నెల రోజులు పైబడి హైవే మీద అందోళన చేస్తున్న రైతులను కలసుకుని సంఘీభావం వ్యక్తం చేవారు.
ఏపీ నుంచి వచ్చిన రైతు సంఘాల బృందంలో ఉన్న మాజీ మంత్రి వడ్డే శోభానాదీశ్వర రావు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ,రైతు సంఘాల నేతలు బి.వెంకట్, రావుల వెంకయ్య,గురునాథరావు, వై.కేశవరావు, జమ్ములయ్య,నాగేంద్ర నాధ్, రాజమోహన్,కాటమయ్య,వైట్ల విద్యాధర్
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎపి రైతు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *