కెసిఆర్, జగన్ మోదీకి లొంగిపోయారు: సిపిఐ నారాయణ

తిరుపతి : దేశంలో పెట్రేగి పోతున్న కాషాయ ప్రమాదాన్ని నిలువరించే శక్తి ఒక్క ఎర్ర జండాకే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.
సీపీఐ 95 వ వార్షికోత్సవ నేపధ్యలో తిరుపతి సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ భయంతో లొంగిపోయారని వ్యాఖ్యానించారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాషాయ కార్పొరేట్ల అనుకూల విధానాలు అవలంబిస్తూ అన్ని వర్గాలపై దాడులు చేస్తున్నారని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతూ మూడు నల్ల చట్టాలు చేశారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ జీవితంలో ఒక్క  నిజం చెప్పారా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు, నల్లడబ్బు వెనక్కు తెస్తాం, నోట్ల రద్దు ఇలా  నిత్యం పచ్చి అబద్దాలు చెప్పారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని జగన్, చంద్రబాబు, కేసీఆర్ లు తమ వ్యక్తిగత సమస్యలతో మోదీకి లొంగిపోయారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిషత్తును మోదీ ముందు తాకట్టు పెడతారా? మోదీ కొత్తగా తన మనసులో అనుకున్న జమిలి ఎన్నికలకు మద్దతు అని చెప్పడం కెసిఆర్, జగన్ వారి దివాళా కోరు తనానికి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *