‘దోస్త్ కెసిఆర్ ను బిజెపి జైలు కు పంపనే పంపదు’

ముఖ్యమంత్రి కెసిఆర్ భారతీయ జనతాపార్టీకి మిత్రుడని, ఆయనని బిజెపి ఎలా జైలుకు పంపిస్తుందని కాంగ్రెస్ సంగారెడ్డి శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు.
 తొందర్లో కెసిఆర్ జైలుకు పోతాడని ఢిల్లీలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన  మీద ఈ రోజు జగ్గారెడ్ది స్పందించారు.
 ముఖ్య మంత్రి కేసీఆర్ ను జైల్లో పెడుతామని సంజయ్ చెప్పడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
“ముఖ్యమంత్రి ని జైల్లో పెడుతున్నామని పదేపదే బండి సంజయ్ చెప్పుతున్నారు. ఎప్పుడు జైల్లో పెడతారో బండి సంజయ్ చెప్పుతారా?ఎప్పటిలోగా జైల్లో పెడుతురో డెడ్ లైన్ చెప్పుతారా?” అని జగ్గారెడ్డి సంజయ్ ని అడిగారు.
‘బీజేపీ,టి ఆర్ ఎస్ ఢిల్లీ లో విందులు చేసుకుంటున్నాయి… గల్లీలో చిందులు వేస్తున్నాయి,” అని వ్యంగంగా చెప్పారు.
జగ్గారెడ్డి ఇంకా ఏమన్నారంటే…
పలు సందర్భలో బీజేపీ కి టి ఆర్ ఎస్ మద్దతు పలికింది. తన నియోజకవర్గం గజ్వెల్ కి ప్రధానిని ఆహ్వానించి, ‘ప్రధాని ప్రేమ ఉంటే చాలు తెలంగాణ ధనిక రాష్ట్రం’ అయినట్లే అని కెసిఆర్  చెప్పలేదా? ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఢిల్లీలో ప్రధాని ని కలిసి కేసీఆర్ రాజకీయ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. చీకటి ఒప్పందానికి ఎంఐఎం  కూడా సూత్రధారే.వీళ్లంతా కలసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు.  కాంగ్రెస్ ను రాజకీయంగా ఎదురుకోలేకనే టి ఆర్ ఎస్,బీజేపీ, ఎంఐఎం ఒక్కటి అయ్యాయి. ప్రజలందరూ ఈ అంశాలను గ్రహించాలి. అందువల్ల కేసీఆర్ జైల్ కు పొడు… కేసీఆర్ ను బీజేపీ జైల్ కు పంపదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *