ఎమ్మెల్యేకు ఏమీ కాలేదు.ఆయన కింద పడిపోలేదు. తనేపడుకున్నారు. అసలు కథ ఇది:
జనగామ జిల్లా జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెళ్లారు. ఆ గ్రామంలో కాలువ పనులకు మాజీ సర్పంచ్ తో సహా గ్రామస్తులు కోర్టు కు వెళ్లి కాలువ పనుల నిలిపేవేతకు స్టే తెచ్చుకున్నారు. ఇది ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి నచ్చలేదు. స్టే తెచ్చకుంటారా అంటూ ఇలా క్రింద పడుకొని నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యదగిరిరెడ్డి ఆ ఏరియా చోటా నవాబ్.అయితే, ఈ గ్రామంలో ఆ పప్పులు ఉడకలేదు. గ్రామస్తులు ముత్తిరెడ్డి కి ఎదురుతిరిగారు.
గ్రామంలోకి ఈ కాలువ ద్వారా మురుకినీరు వస్తున్నదని అందుకే తాము కోర్టు కు వెళ్ళామని గ్రామస్థులు తెలిపారు.
పోటీగా, ఎమ్మెల్యే తీరుకు నిరసన చెబుతూ మాజీ సర్పంచ్ బైఠాయించారు.