ప్రతి గుడికి ఆవు, దూడను అందివ్వనున్న టిటిడి

సోమవారం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమం విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి ప్రారంభమవుతుంది.  టీటీడీ చైర్మన్, ఈఓ లు ఈ  కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.
 హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ గుడికో గోమాత కార్యక్రమం సోమవారం (రేపు)విజయవాడ ప్రారంభమవుతున్నదని
టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
విజయవాడ శ్రీ కనక దుర్గ ఆలయంలో ఉదయం 8 గంటలకు దుర్గమ్మ ఆలయానికి ఆవు, దూడ అందించి ఈ కార్యక్రమాన్ని వారు  ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఈ కార్యక్రమం కింద గుడికో గోమాతను అందిస్తారు.
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *