బంగాళాఖాతంలో తుఫాను‌గా మారిన తీవ్రవాయుగుండం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుఫాన్ గామారింది.
తుపానుకు నివర్ (Nivar) గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే
తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది
రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారనుంది
ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం
తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు
నివర్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
ముందస్తుగా నెల్లూరు జిల్లాకు ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు
ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నాము
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
(కె.కన్నబాబు , కమిషనర్, విపత్తుల శాఖ, ఆంధ్రప్రదేశ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *