కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్ష హెచ్చరిక

నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ  బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడనున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి  అతిభారీ వర్షాలు కురుస్తాయని ఈ శాఖ హచ్చరిక చేసింది.
మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.
సముద్రంలో అలజడిగా ఉంటుంది.
మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
 రైతాంగం వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  జాగ్రత్తలు తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *