చాన్నాళ్ల తర్వాత మొదలైన మేడారం వనదేవతల దర్శనం

తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.  ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారక్కలను భక్తులు దర్శించుకునేందుకు మేడారం పూజారులు అనుమతించారు.
తెలంగాణలో కరోనా వ్యా విజృంభిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో  ఏప్రిల్‌లో అమ్మవార్ల దర్శనాలను ఆపివేశారు.
హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని, గ్రామంలో కరోనా ప్రబలే అవకాశముందని నవంబర్‌ 10 వరకు దర్శనాలను నిలిపివేశారు.
ఈ మధ్య లాక్ డౌన్ ను సడలించడం, బస్సులను నడుపుతూ ఉండటంతో  తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెరవాలని ఆదేశించింది.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయాలను తెరిచి,దైవదర్శనం అనుమతించాలని ప్రభుత్వం  ఆదేశించింది.  దీనితో అటవీ ప్రాంతంలో ఉన్న మేడారంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలు కల్పించారు.
అయితే, ఇపుడు పరిస్థితులు మారడంతో  ప్రభుత్వ అనుమతులతో మరోసారి అమ్మవార్ల దర్శనానికి పూజారులు ఏర్పాట్లు చేశారు.
గుడి మూసి ఉన్నావనదేవలను సందర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, వీరంతా బయటి నుంచే దర్శించుకుని వెళ్తుంటారు. ఇపుడు కార్తీక మాసం కావడంతో గుడిని తెరిచేందుకు నిర్ణయించారు.
బుధవారం అమ్మవార్లకు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిచ్చారు.
కరోనా ప్రబలకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని దేవాదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *