సీఎం జగన్ తిరుమల పర్యటన వివరాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుపతి వెళ్తున్నారు. ఇదీ ఆయన ప్రోగ్రాం

– రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు బయలు దేరతారు.

– రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం.. పద్మావతి అతిథి గృహంలో బస

– సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్

– సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

– రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో పాల్గొంటారు. .

– 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్నారు.

– 24న ఉదయం 7 నుంచి 8 వరకు సుందరకాండ పఠనంలో పాల్గొంటారు…

– 24న ఉదయం 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన

– 24న రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరతారు.