చేనేత కార్మికుల కష్టాల మీద జగన్ కు లోకేష్ లేఖ

అమరావ:  లాక్ డౌన్ వల్ల చితికి పోయిన కుటుంబాలను అదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘నేతన్న నేస్తం’ పథక ప్రయోజనం ఎంతమాత్రం నెరవేరలేదని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ పథకంలో అమలులో అనేక మెలికలు ఉన్నందున చాలా మందికార్మికులు ప్రయోజనం అందక కష్టాల్లో కుమిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వేలాది మంది చేనేత కుటుంబాలున్న ఉర్లలో ప్ర యోజనం వందల మందికి మించి దొరకని విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చారు.
చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఉదహరిస్తూ సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని,చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి   నారా లోకేష్ లేఖ రాశారు.
చేనేత వేలాది కుటుంబాలకు జీవనోపాధికి మూలంగా ఉందని, రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా చేనేత రంగం జీవనోపాధిని అందిస్తోందని చెబుతూ ఆర్డర్లు లేక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నవిషయాన్ని ఆయన ముఖ్యమంత్రి దృష్టి తీసుకువచ్చారు.
ఆయన లేఖలో ప్రధానాంశాలు:
మంగళగిరి,పొందూరు,చీరాల,వెంకటగిరి,ధర్మవరం,ప్రొద్దుటూరు నెల్లూరు  లోని పాతూరు ఇలా అన్ని ప్రాంతాల్లో సమస్య ఉంది.లాక్డౌన్,భారీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 5నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.లాక్డౌన్ వారి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తే… ఇటీవల కురిసిన భారీ వర్షాల వారు పనిచేసే ప్రదేశం నీటితో నిండిపోయి పనిచేయడం అసాధ్యంగా మారింది.
ఒక్క మంగళగిరిలోనే వేలాది నేత కుటుంబాలు ఉన్నాయి.లాక్డౌన్ కు ముందు చేనేత కార్మికులు నెలకు 15 నుండి 25 చీరలు తయారు చేసేవారు.
ఒక్కో చీరకి రూ.450 నుండి రూ.550 సంపాదించే వీరు ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు.అప్పులపాలై దుర్భర జీవితం గడుపుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం పథక ప్రయోజనం ఎంతమాత్రం నెరవేరలేదు
మంగళగిరిలో 2490 చేనేత కుటుంబాలకు గాను కేవలం 300 మంది మాత్రమే ప్రయోజనం పొందారు.
మంగళగిరిలో చేనేత కార్మికుల పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రమంతటా ఎలా ఉందో ఊహించవచ్చు.
సమస్య పరిష్కారానికి నేతన్నల తరఫున 4డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను
1) ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి నేత కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి.
2) సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న నెస్తం’ కింద రూ.24,000 ఇవ్వాలి.
3) సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి.
4) నేతన్న దగ్గర ఉన్న స్టాక్ ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి.
చేనేత వర్గాల డిమాండ్లన్నీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.