వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కోవిడ్

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తర్వాత మరొక వైసిపిప్రముఖుడు, శాసనసభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాాంబాబ్ కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈవిషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు.
‘ఈ రోజు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది చాలా ధైర్యం గా వున్నాను, నా యోగ క్షేమాలు తెల్సుకోవడానికి నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు, అందరికి ధన్యవాదాలు, త్వరలోనే పూర్తిగా కోలుకుని మరలా ఎప్పటిలానే ప్రజల్లోకి వస్తాను.’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.