కరోనాకు మందు ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్న విజయసాయి రెడ్డి

తిరుమల :  కరోనా వైరస్ కు విరుగుడు మందు తొందరగా కనిపెట్టేలా ఆశీర్వదించాలని వైఎస్ ఆర్ సిపి రాజ్యసభ  సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయపాయి రెడ్డి వెంకటేశ్వర్వ స్వామిని కోరుకున్నారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతిలతో కలసి ఆయన తిరుమలలో శ్రీవారిని ర్శించుకున్నారు.
విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాపితంగా ప్రజలను పీడిస్తున్న కరోనానుంచి విముక్తికలించేందుకు త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.
ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు.
అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నానని  శ్రీవారిని ప్రార్దించానని ఆయన తెలిపారు