చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది: దాడి వీరభద్రరావు దాడి

విశాఖపట్నం : రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు.
“చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది. అచ్చం నాయుడు అరెస్ట్ చేస్తే బీసీ లపై దాడులు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు. ప్రతీది ఆరోపణ చెయ్యడం టీడీపీ అలవాటుగా మారిపోయింది” అని ధ్వజమెత్తారు. అవినీతి, దళారి వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తోందని తెలిపారు. జగన్ గారు రెడీ అంటే 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారని, జగన్ గారి దయవల్లే టీడీపీ బ్రతికి ఉందని పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
‘అచ్చెన్నాయుడు మీద ఉన్న ప్రేమ.. కోడెలపై ఎందుకు లేదు. ఆయన ఆత్మహత్య కు చంద్రబాబు కారణం కాదా..? ఎర్రం నాయుడు కు స్పీకర్ పదవి వస్తుంటే వద్దన్నది చంద్రబాబు కాదా..? అచ్చెం నాయుడు బలహీన వర్గాలకు, బీసీ లకు నాయకుడు కాదు. తెలుగుదేశం పార్టీ లో బీసీ కుల నేతలుగా చెప్పుకుంటున్న నేతలు తమ కులాలకు ఎం చేశారు?
బీసీ లకు వైసీపీ న్యాయం చేస్తుంది” అని దాడి వీరభద్రరావు అన్నారు.   ఎన్టీఆర్ హయాంలో నే టిడిపి బీసీ పార్టీ గా ఉందని, బాబు హయాంలో కేవలం డబ్బున్నోళ్ల పార్టీ గా మారిందని చెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని, గతంలో ట్రాన్ పోర్ట్ అధికారులపై దాడులు చేశారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అవుతున్నారని, తన హయాంలో మంత్రులు అవినీతి చేస్తే దానికి అప్పటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాద్యుడేనని చెప్పారు.
చంద్రబాబు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలనన్నారు. అవినీతిపరులపై జగన్ గారు యుద్ధం ప్రకటించారని, అవినీతిపై పోరాటం చేసే ప్రభుత్వం కు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
తన మనుషులను దళారులు గా తయారు చేసి, తమ కార్యకర్తలను ఆందోళనలు చెయ్యాలని చంద్రబాబు చెబుతున్నారన్నారు. అచ్చం నాయుడు వెనుక ఎవరు ఉన్నారో ఆయనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
అవినీతి రహిత పాలన లో భాగంగానే జగన్మోహనరెడ్డి అవినీతి నేతల పని పడుతున్నారని తెలిపారు. అవినీతి ని బయట పెడితే కక్షసాధింపు అంటున్నారని, ఏ టైమ్ లో అరెస్ట్ చెయ్యమంటారో మీరే చెప్పండని చంద్రబాబు నాయుడు ను ప్రశ్నించారు.