ఆంధ్రలో మరొక 62 కేసులు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు మరొక 62 పెరిగాయి. దీనితో మొత్తం కేసులు 1525 కు చేరుకున్నాయి.  గడిచిన 24 గంటల్లో 5943 సాంపిల్స్ ని పరీక్షించగా 62 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయినపట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని కరోనా కేసుల మీద  వైద్య ఆరోగ్య శాఖ ఒక బులెటీన్ విడుదల చేసింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1525 పాజిటివ్ కేసులలో   441 మంది చికిత్స తీసుకుని  డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051.