విషాదం, కాలువలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే పిఎ

తెలంగాణ  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు రావు పీఏ గిరీశ్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంత య్యారు. ధరూర్ సమీపంలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న గిరీష్ నలుగురు స్నేహితులతో కలసి  ఈత కోసం కాలువల దిగాడు. అయితే, ఆయన ఈత రదు. ఫలితంగా ప్రవాహంలో పడిపోయి నీట మునిగి పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.  ఆయన స్నేహితులతో కలసి విందు చేసుకుంటున్నారు. ఈ ఉత్సాహంలో వారంతా ఈత కెళ్లారని తెలిసింది.ఇది అంతర్గాం బైపాస్ సమీపంలో ఈ సాయంత్రం జరిగింది.ధరూర్ ప్రాంతంలో  కాలువ వెంబండి ఆయన ఆచూకి కోసంపోలీసులు గాలిస్తున్నారు.  గిరీశ్ పంచాయత్ రాజ్ ఉద్యోగి.