ఆంధ్రలో ఇసుక ఇలా తరలి పోతా ఉంది… 10 లారీలు సీజ్

చిత్తూరు జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లింగ్ మీద నిఘా పెంచిన సత్యవేడు పోలీసులు  గత రాత్రి 10 ఇసుక లారీలను పట్టుకోవడం లో విజయవంతమయ్యారు. ఒక వైపు ఇసుక కొరతతో జనం అల్లాడుతూ ఉంటే స్మగ్లర్లు మాత్రం లారీలకు లారీల ఇసును ఇతర రాష్ట్రాలక తరలిస్తున్నారు. బెంగుళూరు,చెన్నై హైదరాబాద్ ల ఇసుక తరలిపోతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ఈ లారీలు దొరకడం విశేషం.
నాగలపురం మండలం అచ్ఛమ నాయుడు కండ్రిగ సమీపంలో సరైన అనుమతులు లేకుండా అక్రమంగా లారీలలో తరలిస్తున్న 9,ఇసుక లారీలను పట్టుకొన్నారు.
ఇదే విధంగా వరదాయ పాళెం మండలం కడూరు క్రాస్ వద్ద మరొక ఇసుక లారీని పట్టుకొన్నారు. దీనితో ఒక రోజు రాత్రే 10 లారీలు దొరకడం విశేషం. ఈ లారీ ల మీద కేసులు నమోదు చేసినట్లు తెలిపిన సిఐ శ్రీనివాసులు చెప్పారు.