బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపు రద్దు: ఎపి క్యాబినెట్ నిర్ణయం

గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సీనినటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నది.  జగ్గయ్య పేటలో బాలకృష్ణ వియ్యంకుడికి 498 ఎకరాలను కేటాయిస్తూ గతంలో జారీ చేసిన జివొ ని ఈ రోజు జగన్ క్యాబినెట్ రద్దు చేసింది.
 విశాఖలో  గల్ఫ్ కు చెందిన లులు గ్రూప్ కు కేటాయించిన 13.83 ఎకరాలు కేటాయించడాన్ని కూడా క్యాబినెట్ రద్దు చేసింది.
ఇలాగే, జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు చేయాలని నిర్ణయంతీసుకున్నారు.
ఇదే విధంగా గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని కూడా నిర్ణయించారు.