కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మజ్జి శారద ఈ ఉదయం గుండెపోటుతో  హైదరాబాద్ లో మృతిచెందారు.

ఆమె ఒక నాటి  ఉమ్మడి  ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కూతురు. 1994లో  తండ్రి చనిపోయాక ఆమె కాంగ్రెస్ లో ఆయన వారసత్వం తీసుకున్నారు. గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం రాజీనామా చేశారు. పార్టీలో చేరారు. 2007లో పార్టీ ఆమెను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఆమె ఉమ్మడి రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.