అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పిలుపు

అక్టోబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం జరుపుకోవాలని రాయలసీమ నాయకులు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ రోజున వారు రాష్ట్రావతరణ  పర్వదినం జరుపుకోవాలని నిర్ణయించారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1,1953 సాధించుకున్న విషయం విదితమే.
భారతదేశంలో ప్రప్రధమంగా భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది నాంది పలికింది.
తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాలు కొనసాగింది. తర్వాత 1956లో హైదరాబాద్ తో కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో రాష్ట్రావతరణ దినోత్సవం మారింది.
అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుండి 2014 లో విడిపోవడంతో 1953 లో సాధించుకున్న భూభాగమే ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/rayalaseema-forums-ask-political-parties-to-make-their-rayalaseema-action-plan-public/

ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న జరుపుకోవాల్సిన ప్రాధాన్యత ఏర్పడిందని రాయలసీమ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో, పొట్టి శ్రీరాముల ఆత్మ త్యాగ ఫలితం తో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న ప్రభుత్వం నిర్వహించేలా వత్తిడి తీపుకురావలసిందిగా రాయలసీమ సాగునీటి సమితి నాయకులు  విజ్ఞప్తి చేస్తున్నారు.
నంద్యాల సంజీవనగర్ జంక్షన్, శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అక్టోబరు 1 న జాతీయ జెండా ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలని సమితి నాయకులు నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా కోరారు.
ీనికి సంబంధించి రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నందు శుక్రవారం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ Y.N.రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, యేర్వ రామచంద్రారెడ్డి, M.V. రమణారెడ్డి, నారాయణ రెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు.