భువనగిరి హోటల్ చికెన్ బిర్యానీలో కోడి ఈకలు

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం వుండదు.. అందులో చికెన్ బిర్యానీ అంటే లొట్టలు వేసుకుంటూ తింటాం, అలాంటి బిర్యానీ ప్రేమికుల కోసమే ఈ వార్త..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో నలుగురు స్నేహితులు కలిసి బిర్యానీ తిందాం అని భువనగిరి పట్టణంలోని ప్రముఖ హోటల్ అయిన శిల్పా రెస్టరెంట్ కు వెళ్లారు.
ఆ హోటల్ ఎప్పటి లాగే బిర్యానీ ప్రేమికులతో కిక్కిరిసి పోయింది..అయినా పర్లేదు, బిర్యానీ తినే వెళ్దాం అనీ కొద్దిసేపు ఆగి మరీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసారు.
చికెన్ బిర్యానీ వచ్చాక తిందాం అనేలోపే వాళ్లకు కోడి ఈకలు కనిపించాయి. చికెన్ బిర్యానీ కోడిగుడ్డు ఇస్తారు గాని ఈ  ఈకలేంటి అని షాక్ అయ్యారు నలురుగు మిత్రులు.
వెంటనే హోటల్ వాళ్లను ఇది ఏంటి ఈకల బిర్యాని అని అడిగితే,  అదేంలేదు సర్ చిన్న పొరపాటు మాత్రమే అని లైట్గా తీసుకోమన్నారు.
దానితో ఆ హోటల్కి వచ్చిన వారు జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ చేశారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్ స్పందన చూసి వారు మరింత అవాక్కయ్యారు.
‘నేను ఏమి చేయలేను నాకు స్టాఫ్ లేదు,’ అని అనడమేకాదు, ఇది ప్రభుత్వ వైఫల్యంగా సదరు అధికారే పేర్కొనడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడి నుండి తిరుగు మొఖం పట్టారు
.ఇప్పుడు ఆ హోటలోని కోడి ఈకల బిర్యాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.